చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాశ్మీర్ లో మోడీ, అమిత్ షా రాజతంత్రం ఫలించింది, రాజకీయం చేస్తారా ?: రజనీకాంత్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఆంశంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా చాకచక్యంగా అనుకున్న పని పూర్తి చేశారని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు కృష్ణార్జునులు అని రజనీకాంత్ మరోసారి అన్నారు.

చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని నివాసంలో రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు కృష్ణార్జునులు అని రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాబిప్రయాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు.

Actor Rajinikanth praised the Union Government in Jammu and Kashmir issue

కొందరు నాయకులు ఏ విషయం రాజకీయం చెయ్యాలో, ఏ విషయం రాజకీయం చెయ్యకూడదో తెలియడం లేదని రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. తీవ్రవాదులు భారత్ లో చొరబడటానికి కాశ్మీర్ ప్రవేశ మార్గం అయ్యిందని రజనీకాంత్ అన్నారు.

అలాంటి క్లిష్టమైన కాశ్మీర్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా రాజతంత్రంతో వ్యవహరించి తీవ్రవాదులకు కళ్లెం వేశారని, అందుకే వారిని కృష్ణార్జునులు అని అన్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ వివరించారు. అయితే ఈ విషయాన్ని కొందరు రాజకీయం చెయ్యడం చాల భాదాకరంగా ఉందని రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు కృష్ణార్జునులు అయితే వారు యుధ్దం ఎవరితో చేస్తారో రజనీకాంత్ చెప్పాలని పలు తమిళ సంఘాలు డిమాండ్ చేశాయి.

English summary
Actor Rajinikanth praised the Union Government in Jammu and Kashmir issue, and said that, they have planned and executed the Article 370 perfectly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X