అనురాగ్ కశ్మప్పై కేసు: రేప్ చేశాడని నటి కంప్లైంట్..
ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్పై నటి ఫిర్యాదు చేశారు. లైంగికంగా వేధించారని పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ముంబైలోని పోలీసు స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రేప్, అసభ్య ప్రవర్తన, లైంగికదాడి, శారీరక హింస ఆరోపణలపై కంప్లైంట్ రావడంతో ఐసీపీ 376, 354, 341, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తనను లైంగికంగా వేధిస్తున్నారని నటి ఆరోపణలు చేయగా ఇదివరకే అనురాగ్ కశ్యప్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఖండిస్తూ చాలా ట్వీట్స్ కూడా చేశారు. కానీ అతని వ్యాఖ్యలను లాయర్ కూడా పేర్కొన్నారు. కశ్యప్పై తప్పుడు, నిరాధార ఆరోపణలు చేశారని తెలిపారు. ఇటీవల చేసిన తప్పుడు ఆరోపణలతో ఆయన చాలా బాధపడ్డారని తెలిపారు. మీ టూ ఉద్యమం పేరుతో కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ప్రస్తావించారు. దానిని తమకు అనుకూలంగా మలచుకొని.. ఒకరి క్యారెక్టర్ చెడుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు.
Recommended Video
ఈ విషయంలో తన క్లయింట్ అన్నీ హక్కులు పొందుతారని.. తప్పు చేయనందున చట్ట ప్రకారం ముందుకెళ్తారని పేర్కొన్నారు. ఈ మేరకు లాయర్ మీడియాకు స్టేట్ మెంట్ ఇచ్చారు. మీ టూ ఉద్యమం తర్వాత అనురాగ్ కశ్యప్ పేరు బయటకు వచ్చింది. అయితే చాలా మంది అతనికి మద్దతు తెలుపడం విశేషం. తాప్సీ పన్ను, సైయమీ ఖేర్, రాం గోపాల్ వర్మ, అనుభవ్ సిన్హా, అనురాగ్ కశ్యప్ ఇద్దరు మాజీ భార్యలు కూడా అతను అమాయకుడు అని పేర్కొన్నారు.