గుజరాత్ లో ఎన్నికల ప్రచారం చేస్తా, అధికారం కాంగ్రెస్ పార్టీ దే, బహుబాష నటి కుష్బు !
ఆనారోగ్యంతో నటి కుష్బుకు శాస్త్ర చికిత్సఆరోగ్యంగానే ఉన్నాను, గుజరాత్ లో ఎన్నికల ప్రచారం చేస్తాకచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది, ప్రముఖ నటి కుష్బు జోస్యం
చెన్నై: గుజరాత్ 2017 శాసన సభ ఎన్నికల కోసం ప్రచారం చేస్తానని బహుబాష నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కష్బు అన్నారు. ఇటీవల అనారోగ్యంతో శాస్త్ర చికిత్స చేయించుకున్న నటి కష్బు ఇంటికి చేరుకుని ఆరోగ్యంగా ఉన్నారు. నటి కుష్బు ఆరోగ్యం మెరుగుపడిన నేపథ్యంలో ఆమె హుషారుగా కనపడుతున్నారు.
సోమవారం నటి కుష్బు చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ లో జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ లో తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో తాను పర్యటించి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రచారం చేస్తానని చెప్పారు.
తనకు హిందీ బాష చాల బాగ వస్తోందని, అందు వలన గుజరాత్ లో శాసన సభ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కష్బు చెప్పారు. డిసెంబర్ 5వ తేదీ తరువాత గుజరాత్ లో శాసన సభ ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉందని కుష్బు వివరించారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు ఎన్నికల ప్రచార కార్యక్రమం షెడ్యూలు నిర్ణయిస్తోందని కుష్బు వివరించారు. గుజరాత్ లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని కుష్బు జోస్యం చెప్పారు. కుష్బు ఎన్నికల ప్రచారం విషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా షెడ్యూల్ ప్రకటించవలసి ఉంది.