లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగా అదిర్ రంజన్ చౌదరీ ఎంపీక
లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగా పశ్చిమ బెంగాల్కు చెందిన ఆదిర్ రంజన్ చౌదరీ ఎన్నికయ్యారు. ఆదిర్ రంజన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర్రంలోని బెర్హామ్పోర్ లోక్సభ నియోజక వర్గం నుండి గెలుపోందారు. కాగా పశ్చిమ బెంగాల్ నుండి గెలిచిన ఎకైక ఎంపీ అభ్యర్థి రంజన్ చౌదరీ...కాగా 1999 నుండి కూడ పార్లమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటివల జరిగిన ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి అపుర్భా సర్కార్ పై 80 వేల ఓట్ల మెజారీతో గెలిచారు.
లోక్ సభలో పార్టీ నేత రంజన్ చౌదీరీ ఎన్నికైనట్టు కాంగ్రెస్ పార్టీ లేఖను పంపింది.పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిటిలు, వ్యవహారాల్లో ఆయనే చీఫ్గా కొనసాగనున్నారు. కాగా ప్రతిపక్ష పదవి చేపట్టేందుకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాకరించడంతో చివరకు లోక్సభలో సీనియర్ గా ఉన్న రంజన్ చౌదరికి కట్టబెట్టారు.
గత పార్లమెంట్లో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మల్లికార్జున ఖార్గె ఓడిపోయాడు. దీంతో రాహుల్ గాంధీకి ఈ భాద్యతలు తీసుకోవాలని కోరారు. అయితే రాహుల్ గాంధీ ఇందుకు నిరాకరించడంతో చౌదరీకి అప్పగించారు. ఇక చౌదరీ ఎన్నికపై సోమవారం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రంజన్ చౌదరీ ద ఫైటర్ అంటూ మోడీ సైతం అభినందించారు.