సూపర్: ప్రధాని మోడీ పాలనపై అద్వానీ ప్రశంస
రిషికేష్: ప్రధాని నరేంద్ర మోడీ రెండేళ్ల పాలన పైన బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ప్రశంసలు కురిపించారు. 2014లో బీజేపీ, మిత్రపక్షం అద్భుత విజయం సాధించింది. మోడీ జూన్ మే 26న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రధాని అయి మరో నాలుగు రోజులకు రెండేళ్లవుతుంది.
ఈ నేపథ్యంలో బీజేపీ విజయ దివస్ నిర్వహించనుంది. అన్ని రాష్ట్రాలోల దీనిని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అద్వానీ ప్రధాని మోడీ పైన ప్రశంసలు కురిపించారు. సర్కారు పని తీరు ప్రజలు ఆశించన దానికంటే బాగుందన్నారు. ప్రభుత్వ విధానాలు అద్భుతమని కితాబిచ్చారు.
ప్రధాని మోడీ, ఢిల్లీ సీఎం కేజ్రీకి బెదిరింపు
ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇళ్లను బాంబులతో పేల్చేస్తానంటూ ఓ ఆకతాయి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఒక ఫోన్ కాల్ వచ్చినట్లు ఎన్ఐఏ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో, సంబంధిత అధికారులు రంగంలోకి దిగి సోదా చేశారు. ఎటువంటి బాంబులు లేవని, ఈ ఫోన్ కాల్ ఆకతాయి పనిగా భావిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.