వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షాకింగ్: 100 మందికి ఒకటే ఆధార్ నెంబర్, ఇలా తెలిసింది
దాదాపు 100 మంది రైతులకు ఒకటే ఆధార్ నంబర్ ఉండటాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు గుర్తించారు. అది ఎలా వచ్చిందనే విషయాన్ని అధికారులు గుర్తించలేకపోయారు.
ముంబై: దాదాపు 100 మంది రైతులకు ఒకటే ఆధార్ నంబర్ ఉండటాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు గుర్తించారు. అది ఎలా వచ్చిందనే విషయాన్ని అధికారులు గుర్తించలేకపోయారు.
రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ను అనుసంధానించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలుమార్లు హెచ్చరించింది. దీని వల్ల లబ్ధిదారులకు నేరుగా రుణమాఫీ నగదు అందుతుందని, నకిలీ ఖాతాలను తొలగించవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.
రుణమాఫీ అమలు కోసం రైతులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రుణమాఫీ పొందిన రైతుల జాబితాను అధికారులు పరిశీలించగా దాదాపు 100 మంది లబ్ధిదారులకు ఒకటే ఆధార్ నంబర్ ఉంది.
నకిలీ లబ్ధిదారులను గుర్తించేందుకు ఆధార్ నంబర్ను పరిశీలిస్తామని, కానీ ఇంతమంది రైతులకు ఒకే ఆధార్ నంబర్ ఎలా ఉందో తెలియడం లేదని, విచారణ జరుపుతున్నామని అధికారులు చెప్పారు.
English summary
The Maharashtra government's attempt of online registration for loan waiver implementation has sent the authorities into a tizzy as names of over 100 farmers have been found linked to a single Aadhaar number.
Story first published: Thursday, October 26, 2017, 0:36 [IST]