నిన్న ప్యాలెస్లో.. నేడు డ్యాంపై యువజంట రొమాన్స్
బెంగళూరు: మైసూరు ప్యాలెస్లో ఓ యువ జంట తీసుకున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ప్రకంపనలు మరవకముందే మరో యువజంట కేఆర్ఎస్ డ్యాం పైన తీసుకున్న ఫోటో షూట్ వీడియో చర్చనీయంగా మారింది.
ఉగ్రవాదుల హిట్ లిలో ఉన్న కేఎస్ఆర్ డ్యాం పైన అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాల సాయంతో ఓ యువజంట తీసుకున్న వీడియోలు వాట్సాప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ జంట మైసూరుకు చెందినవారు అయి ఉంటారని అనుమానిస్తున్నారు.
కాగా, కొద్ది రోజుల క్రితం ప్రఖ్యాత మైసూర్ ప్యాలెస్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించడం వివాదానికి దారి తీసింది. బెంగళూరుకు చెందిన ఆదిత్య - నవ్య జంట ఈ ప్యాలెస్లో పెళ్లికి ముందు ఫోటోలు తీయించటుకున్నారు.
డ్యూయెట్ సాంగ్ వీడియో కూడా తీయించుకున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించాయి. దీనిపై విచారణకు కూడా డిమాండ్ చేశారు. అంతలోనే, ఇప్పుడు నిషేదిత కేఆర్ఎస్ డ్యాం పైన మరో జంట ఫోటోలు తీసుకుంది.