అర్ధరాత్రి నగరంలో బైక్పై రైడ్: నెటిజన్ల విమర్శ, కిరణ్ బేడీ చురక
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ శుక్రవారం రాత్రి మరో మహిళతో కలిసి బైక్పై నగరంలో పర్యటించారు. నగరంలో మహిళల భద్రత ఎలా ఉందో తెలుసుకోవటానికి ఈ పర్యటన జరిపానని, పరిస్థితులు సంతృప్తికరంగానే ఉన్నా
పుదుచ్చేరి: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ శుక్రవారం రాత్రి మరో మహిళతో కలిసి బైక్పై నగరంలో పర్యటించారు. నగరంలో మహిళల భద్రత ఎలా ఉందో తెలుసుకోవటానికి ఈ పర్యటన జరిపానని, పరిస్థితులు సంతృప్తికరంగానే ఉన్నాయని శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇలాంటి పర్యటనలు భద్రత లేని ప్రాంతాల్లో మరింత భద్రత పెంచేందుకు ఉపయోగపడుతాయన్నారు. అదే సమయంలో, బైక్ నడిపిన మహిళతో పాటు, కిరణ్ బేడీకి హెల్మెట్ లేకపోవడంపై విమర్శలు వచ్చాయి.
హెల్మెట్ ధరించడం మంచిది కదా మేడమ్ అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. మీ భద్రత కూడా ముఖ్యమేనని పేర్కొన్నాడు. భద్రత గురించి తెలుసుకోవడానికి రాత్రి పూట పర్యటించడం మంచిదే కానీ హెల్మెట్ ఎక్కడ మేడమ్ అంటూ మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.
దీనిపై కిరణ్ బేడీ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు మహిళలు స్కూటీపై అర్ధరాత్రి ఎలా వెళ్తున్నారో చూడండి.. హెల్మెట్ కాదని ఆమె నెటిజన్లకు చురకలంటించారు.