వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓడిపోయే వాళ్లే ఆడిపోసుకుంటున్నారు: ఈవీఎంల‌పై ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌

|
Google Oneindia TeluguNews

పాట్నా: అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం అందుబాటులోకి వ‌చ్చిన‌ప్పుడే పోలింగ్ అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట ప‌డింద‌ని జ‌న‌తాద‌ళ్ (యునైటెడ్‌) అధినేత‌, బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ అన్నారు. ఈవీఎంల‌ను ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత పోలింగ్ ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క‌త పెరిగింద‌ని చెప్పారు. ఓట‌మిని జీర్ణించుకోలేని కొంద‌రు నాయ‌కులు ఈవీఎంల ప‌నితీరును ప్ర‌శ్నిస్తున్నార‌ని, అదేమీ కొత్త విష‌య‌మేమీ కాద‌ని అన్నారు.

భార‌తీయ జ‌న‌తాపార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా మంగ‌ళారం రాత్రి ఏర్పాటు చేసిన విందుకు హాజ‌రు కావ‌డానికి ఆయ‌న ఈ మ‌ధ్యాహ్నం పాట్నా నుంచి దేశ రాజ‌ధానికి బ‌య‌లుదేరి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా విమానాశ్ర‌యంలో త‌న‌ను క‌లిసిన విలేక‌రుల‌తో కొద్దిసేపు ముచ్చ‌టించారు.

సారీ మైడియర్ రాహుల్‌జీ! పార్టీలో బఫూన్లు ఉన్నారు..: క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో చిచ్చు సారీ మైడియర్ రాహుల్‌జీ! పార్టీలో బఫూన్లు ఉన్నారు..: క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో చిచ్చు

 After introduction of EVMs, elections have become transparent, says Bihar CM

దేశంలోని 21 ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు ఈవీఎంల ప‌నితీరుపై అనుమానాలు వ్య‌క్తం చేస్తుండ‌టంపై ఆయ‌న నితీష్‌కుమార్ స్పందించారు. బ్యాలెట్ పేప‌ర్ల వ‌ల్ల రిగ్గింగ్‌కు అవ‌కాశం ఉండేదని, ఇప్పుడా అవ‌కాశం లేద‌ని అన్నారు. ఈవీఎంల‌పై ప‌నితీరుపై ఇప్ప‌టికే వెల్లువెత్తిన అనేక అనుమానాల‌కు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌.. స్పందించింద‌ని, వాటిని నివృత్తి చేసింద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ- ఇంకా ఈవీఎంల‌ను అనుమానించ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని అన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేయాల‌నేది త‌మ ప్ర‌ధాన డిమాండ్ అని, దీనికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్పారాయ‌న‌. దేశ‌వ్యాప్తంగా ఉమ్మ‌డి పౌర‌స‌త్వ నిబంధ‌న‌లు అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. అత్యంత కీల‌క‌మైన అయోధ్య అంశాన్ని న్యాయ‌స్థానాలు, ప‌రస్ప‌ర అవ‌గాహ‌న మార్గాల ద్వార‌నే ప‌రిష్క‌రించుకోవాల్సి ఉంద‌ని చెప్పారు. ఈ దిశ‌గా బీజేపీ కృషి చేస్తుంద‌ని తాను విశ్వ‌సిస్తున్న‌ట్లు చెప్పారు.

English summary
Bihar CM Nitish Kumar on Tuesday says that After introduction of EVMs, elections have become transparent. It's a technology which has been questioned multiple times and have been answered by Election Commission of India, He added. Faction which begins losing says there were discrepancies in elections, It's not new, Nitish Kumar concluded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X