ఇక మార్కెట్లోకి పతంజలి ఖాదీ యోగా వేర్
న్యూఢిల్లీ: ఇటీవలే పతంజలి నూడుల్స్ను మార్కెట్లోకి తెచ్చిన యోగా గురువు బాబా రాందేవ్ ఇప్పుడు మరికొన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ వేర్ దుస్తులు అడిడాస్, నైక్ మాదిరిగానే పతంజలి యోగావేర్ దుస్తులు తయారు చేయనున్నారు.
అలాగే ఆరోగ్య పానీయాలు, సౌందర్య సాధనాలు పతంజలి నుంచి తయారు చేస్తామని బాబా రాందేవ్ తెలిపారు. పవర్ వీటా, హార్లిక్స్, బోర్నవీటా, బేబీ కేర్ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలన్నంటికీ పోటీగా పతంజలి ఉత్పత్తులు తీసుకురానున్నారు.
‘వస్త్రం' పేరుతో పతంజలి యోగా వేర్ దుస్తులు ఖాదీతో తయారు చేస్తున్నట్లు బాబా రాందేవ్ తెలిపారు. అనుకూలమైన ధరకే వీటిని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
పతంజలి నూడుల్స్కు మంచి డిమాండ్ వస్తోందని ఢిల్లీ ఎన్సిఆర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో నూడిల్స్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, హర్యానాకు చెందిన రెజ్లర్ సుశీల్ కుమార్ పతంజలి ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారని తెలిపారు.