వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండిగో ఎయిర్ లైన్స్ తగ్గింపు ధరలు.. రూ.777 నుంచి ప్రారంభం

రాయితీ టిక్కెట్ల పోరులోకి ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా దిగింది. దేశీయ మార్గాలలో ఎంపిక చేసిన మార్గాలలో అన్నీ కలుపుకొని రూ.777కే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: రాయితీ టిక్కెట్ల పోరులోకి దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా దిగింది. దేశీయ మార్గాలలో తగ్గింపు ధరలను ఈ సంస్థ ప్రకటించింది. ఎంపిక చేసిన మార్గాలలో అన్నీ కలుపుకొని రూ.777కే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది.

ఈ ఆఫర్ కింద ఫిబ్రవరి 25 వరకే టిక్కెట్లు బుక్ చేసుకునే వీలుంది. అలాగే ఈ టిక్కెట్ల ద్వారా ఏప్రిల్ 27 వరకు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. సెలెక్టడ్ సెక్టార్లో, సెలెక్టడ్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.

After Spicejet, Indigo launches Rs 777 offer

ఈ తగ్గింపు టిక్కెట్ల ధరలు అగర్తలా-గౌహతి, శ్రీనగర్-చండీగఢ్ మార్గాలలో రూ.777కే అందుబాటులో ఉండగా, చెన్నై-హైదరాబాద్ మార్గంలో మాత్రం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 19 రోజుల ముందుగా బుక్ చేసుకోవాలని, సీట్లు పరిమితంగా ఉన్నాయని ఇండిగో తెలిపింది.

ఒకవేళ ప్రయాణాన్ని విరమించుకుని టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాలు, సందేహాలకు ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని సంస్థ కోరింది.

English summary
NEW DELHI: After SpiceJetBSE -1.79 % on Wednesday announced flat fares of Rs 777 on the domestic sector to woo more flyers in the lean season, Indigo too came out with a similar offer. Indigo, the country's biggest airline, has announced 'See something new at Rs 777' offer. The all-inclusive fare of Rs 777 is applicable for booking tickets till 25 February for travel till 27 April.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X