టెక్కీ:టీసిఎస్ బాటలోనే హెచ్ సి ఎల్ లు కూడ, షేర్ల బై బ్యాక్ కు సై, బోర్డుదే తుది నిర్ణయం
టాటా కన్సల్టెన్సీ తరహలోనే హెచ్ సి ఎల్ కూడ షేర్ల బై బ్యాక్ ను ప్రకటించేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. రెండు రోజుల క్రితమే టాటా కన్సల్టెన్సీ షేర్ల బై బ్యాక్ ను ప్రకటించింది. హెచ్ సి ఎల్ కూడ అదే దారి
ముంబై: ప్రముఖ దేశీయ ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మరో దేశీయ అగ్రగ్రామి సంస్థ హెచ్ సి ఎల్ లు కీలకమైన నిర్ణయాన్ని తీసుకోనున్నాయి.షేర్ల బై బ్యాక్ నిర్ణయాన్ని తీసుకొనే అవకాశం ఉందని సంబందిత వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ షేర్ల బై బ్యాక్ ను ప్రకటించింది. తాజాగా హెచ్ సి ఎల్ కూడ టాటా కన్సల్టెన్సీ బాటలోనే పయనించే అవకాశం ఉంది.
షేర్ల బై బ్యాక్ నిర్ణయాన్ని ప్రకటించేందుకుగాను కంపెనీ యోచిస్తోందని ఈ విషయాన్ని బోర్డు ముందుకు తీసుకురానున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల క్రితమే టీసిఎష్ రూ.16 వేల కోట్ల మెగా షేర్ల బై బ్యాక్ ను చేపట్టనున్నట్టు ప్రకటించింది.
ఇన్వెస్టర్లకు తీపి కబురును అందించింది. ప్రస్తుతం తాము కూడ ఇన్వెస్టర్ల వ్యాల్యూ పెంచేందుకు చూస్తున్నామని షేర్ బై బ్యాకును పిలుపు ఇవ్వబోతున్నామని కంపెనీలో కీలకమైన వ్యక్తి చెబుతున్నారు.
ఒక్కసారి ఈ విషయమై తాము తుది నిర్ణయం తీసుకొన్నాక, బోర్డు ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు. బోర్డు ముందుకు వెళ్ళిన తర్వాత హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ షేర్ హోల్డర్స్ ఈ విషయాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.
డిసెంబర్ 31 వరకు కంపెనీ వద్ద సుమారు రూ.2,2145 కోట్ల నిల్వలున్నాయి. అంతే కాకుండా ఫిక్స్ డ్ డిపాజిట్లు మరో రూ.10,506.9 కోట్లున్నాయి.టీసిఎస్ తరహలో మెగా బై బ్యాక్ ఆఫర్ చేయకపోయినా బై బ్యాక్ మాత్రం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ దేశీయ ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మరో దేశీయ అగ్రగ్రామి సంస్థ హెచ్ సి ఎల్ లు కీలకమైన నిర్ణయాన్ని తీసుకోనున్నాయి.షేర్ల బై బ్యాక్ నిర్ణయాన్ని తీసుకొనే అవకాశం ఉందని సంబందిత వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ షేర్ల బై బ్యాక్ ను ప్రకటించింది. తాజాగా హెచ్ సి ఎల్ కూడ టాటా కన్సల్టెన్సీ బాటలోనే పయనించే అవకాశం ఉంది.