వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో ఏజెంట్ స్మిత్.. సార్ట్‌ఫోన్ యూజర్లు జర భద్రం..

|
Google Oneindia TeluguNews

డిజిటల్ ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ పెను సవాల్‌గా మారింది. రెండు వైపులా పదునున్న కత్తిలాంటి టెక్నాలజీని ఉపయోగించి ఎవరు, ఎప్పుడు, ఎలా దాడి చేస్తారన్నది ఊహించలేని పరిస్థితి. ముఖ్యంగా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలలోకి మాల్‌వేర్‌లు జొప్పించి సమాచారాన్ని దోచుకున్న ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాను సైతం హ్యాకింగ్ భూతం వదలిపెట్టలేదు. ఇప్పుడు అలాంటి వైరస్ భారత్‌లో ఎంటరైంది.

రూ.200 బాకీ 30 ఏళ్ల తర్వాత తీర్చాడు.. ఎంత ఇచ్చాడో తెలుసా..?రూ.200 బాకీ 30 ఏళ్ల తర్వాత తీర్చాడు.. ఎంత ఇచ్చాడో తెలుసా..?

ఇండియాలో ఏజెంట్ స్మిత్

ఇండియాలో ఏజెంట్ స్మిత్

వాట్సప్ ఓపెన్ చేయగానే యాడ్ కనిపిస్తోందా? అయితే ఒక్క నిమిషం ఆలోచించాల్సిందే. మీ ఫోన్‌లోకి ఏజెంట్ స్మిత్ ఎంటరయిందని అనుమానించాల్సిందే. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యూజర్లను ఏజెంట్ స్మిత్ వైరస్ భూతం భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2.5కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లపై ఈ మాల్ వేర్ దాడి చేసిందని చెక్ పాయింట్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ప్రకటించింది.

స్మార్ట్ ఫోన్‌లో చొరబడి

స్మార్ట్ ఫోన్‌లో చొరబడి

ఏజెంట్ స్మిత్ మాల్‌వేర్ భారత్‌లో 1.5 కోట్ల ఫోన్లలో ప్రవేశించినట్లు సైబర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. గూగుల్‌కు సంబంధించిన అప్లికేషన్ రూపంలో ఈ వైరస్ ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది. యూజర్లకు తెలియకుండానే ఫోన్‌లో యాప్‌లను అన్ ఇన్‌స్టాల్ చేసి వాటి స్థానంలో ఫోన్‌కు హాని కలిగించే ఇతర వెర్షన్స్‌ను రీప్లేస్ చేస్తుంది. గూలిగన్, హమ్మింగ్ బడ్, కాపీ క్యాట్ తదితర వైరస్‌లను పోలి ఉండే ఏజెంట్ స్మిత్ మనకు తెలియకుండానే ఫోన్‌లో చొరబడి దాడి చేస్తున్నట్లు సైబర్ ఎక్స్‌పర్ట్స్ తేల్చారు.

థర్డ్ పార్టీ యాప్ నుంచి

థర్డ్ పార్టీ యాప్ నుంచి

యాప్స్ 9 అనే థర్డ్ పార్టీ యాప్ స్టోర్ల నుంచి ఏజెంట్ స్మిత్ డౌన్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, యూకే, అమెరికా, ఆస్ట్రేలియాలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. థర్డ్ పార్టీ యాప్ స్టోర్లలో భద్రత లేనందునే ఏజెంట్ స్మిత్ మాల్‌వేర్ ఆండ్రాయిడ్ ఓఎస్‌పై దాడి చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ వైరస్ ప్రస్తుతానికి ఫోన్లలోని ఎలాంటి డేటా తస్కరించడంలేదని, కేవలం యాడ్స్ డిస్ ప్లే చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నట్లు తేలింది. అయితే భవిష్యత్తులో దీన్ని ఫోన్లలోని బ్యాంక్ వివరాలతో పాటు ఇతర డేటాను దొంగలించేందుకు ఉపయోగించే అవకాశం లేకపోలేదు.

English summary
new revelation by cybersecurity solutions provider Check Point which on Wednesday claimed that 'Agent Smith," a new variant of mobile malware, quietly infected around 2.5 crore Android devices globally, including 1.5 crore mobile devices in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X