గుజరాత్లో కాంగ్రెస్కు గట్టి షాక్: వాఘేలాతో పార్టీ ముక్కలు!
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్. గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీని ముక్కలు చేస్తున్నారు.
గాంధీ నగర్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్. గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీని ముక్కలు చేస్తున్నారు.
వాఘేలా (నాడు బీజేపీ రెబెల్) 17 ఏళ్ల క్రితం తన రాష్ట్రీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీను చీల్చుతున్నారు.
ఆయన శుక్రవారం నాడు తన పుట్టిన రోజు సందర్భంగా అనుచరులతో భేటీ అయ్యారు. ఆయన గుజరాత్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుతో వాఘేలా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన ఎన్నికలకు ముందు ఆ పార్టీకి షాకిస్తున్నారు. పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనతో కలిసి బయటకు వెళ్లనున్నారు.
మరోవైపు, గుజరాత్లో పదకొండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి మీరా కుమార్కు కాకుండా ఎన్డీయే అభ్యర్థి కోవింద్కు ఓటు వేశారు.