వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఓకేలో 4ఉగ్రవాద స్థావరాల ధ్వంసం: 2016 సర్జికల్ స్ట్రైక్స్ తాజా వీడియో ఇదే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/శ్రీనగర్: 2016లో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌(పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు(సర్జికల్‌ స్ట్రైక్స్‌) జరిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్‌పై ఉగ్రదాడులకు సిద్ధం చేసిన నాలుగు 'టెర్రర్‌ లాంచ్‌ పాడ్‌'లను భారత సైన్యం ధ్వంసం చేసింది.

కాగా, ఈ సర్జికల్‌ స్ట్రైక్స్‌లో దాదాపు 50 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను నరేంద్ర మోడీ ప్రభుత్వం గత జూన్‌లో బహిర్గతం చేసింది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగి శుక్రవారం(సెప్టెంబరు 28)కి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా గురువారం మరో వీడియోను విడుదల చేసింది.

Ahead of second anniversary, new video evidence of 2016 Surgical strike emerges

కాశ్మీర్‌ బారాముల్లాలోని ఉడి సైనికస్థావరంలోకి చొరబడిన ఉగ్రవాదులు 18 మంది భారత సైనికులను హతమార్చారు. దీనికి ప్రతీకారంగా సరిగ్గా 11 రోజుల తర్వాత భారత సైనికులు మెరుపుదాడుల ద్వారా సత్తా చాటారు. 2016 సెప్టెంబర్‌ 28వ తేదీ అర్థరాత్రి, 29వ తెల్లవారు జాములోగా ముగించిన ఈ దాడులకు సంబంధించిన నాలుగు వీడియోలున్నాయి.

జమ్మూ రీజియన్‌లో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి భద్రతను పర్యవేక్షించే 15 దళాలకు అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) రాజేంద్ర నింబోర్కర్‌ వ్యవహరించారు. సర్జికల్‌ దాడులకు ప్రణాళిక రచించడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు.

English summary
There is more proof of the much spoken about surgical strikes that the Indian Army carried out in Pakistan occupied Kashmir in 2016. Just two days ahead of the second anniversary, yet another video of the Indian Army's surgical strikes against terrorist launchpads in Pakistan Occupied Kashmir in late September 2016 has emerged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X