వస్త్ర గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం, పేలుళ్లు: 9 మంది మృతి, 12 మందికి గాయాలు
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారీ పేలుళ్లు సంభవించడంతో 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి.
అహ్మదాబాద్లోని పారిశ్రామికవాడ పిరానా- పిప్లజ్ రోడ్లో ఉన్న ఓ వస్త్ర గోదాంలో మంటలు చెలరేగి పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ పేలుళ్ల తీవ్రతకు భవనం పైకప్పు కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
26 ఫైరింజిన్లతో వచ్చిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఎల్జీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.
Gujarat: Rescue operation underway at the fire accident site on Piplaj road in Ahmedabad.
— ANI (@ANI) November 4, 2020
Nine deaths have been reported so far in the incident. pic.twitter.com/zmQkMoP9YU