తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం: అంతా ఓకే !
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించడంతో ఆమె స్థానంలో సీఎం భాధ్యతలు స్వీకరించడానికి ఆ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఓ. పన్నీర్ సెల్వం సిద్దం అయ్యారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించడంతో ఆమె స్థానంలో సీఎం భాధ్యతలు స్వీకరించడానికి ఆ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఓ. పన్నీర్ సెల్వం సిద్దం అయ్యారు. అన్నాడీఎంకే పార్టీ శాసన సభ్యులతో కలిసి పన్నీర్ సెల్వం రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ విద్యాసాగర్ రావ్ ను కలుసుకోనున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వం గవర్నర్ ను కలిసి మనవి చెయ్యనున్నారు. అన్నాడీఎంకేకి 136 మంది శాసన సభ్యులు ఉన్నారు. అందులో దాదాపు అందరూ శాసన సభ్యులు పన్నీర్ సెల్వం సీఎంగా ఉండటానికి తమ పూర్తి మద్దతు ఇచ్చారని సమాచారం.
సోమవారం అర్దరాత్రి అన్నాడీఎంకే కార్యాలయం నుంచి పన్నీర్ సెల్వం తన పార్టీ శాసన సభ్యులతో కలిసి రాజ్ భవన్ బయలుదేరి వెళ్లారు. తరువాత గవర్నర్ విద్యాసాగర్ రావ్ ను కలిసిన అన్నాడీఎంకే పార్టీ నాయకులు అధికారికంగా పన్నీర్ సెల్వంకు సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నారు. పన్నీర్ సెల్వం సీఎం అయిన తరువాత జయలలితకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.