క్యూ కట్టేశారు: పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకే సీనియర్ నేతలు మద్దతు
అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్)కు అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ వ్యవస్థాపకులులో ఒకరైన తమిళనాడు మాజీ స్పీకర్, ప్రముఖ న్యాయవాది పీహెచ్.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం చెయ్యడాన్ని అడ్డుకుంటున్న ఆ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకే సీనియర్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఎలాగైనా శశికళను అన్నాడీఎంకే చీఫ్ పదవి నుంచి కూడా తప్పించాలని పావులుకదుపుతున్నారు.
అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్)కు అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ వ్యవస్థాపకులులో ఒకరైన తమిళనాడు మాజీ స్పీకర్, ప్రముఖ న్యాయవాది పీహెచ్. పాండియన్, మాజీ మంత్రి క్రిష్ణగిరికి చెందిన కేపీ. మునిసామితో పాటు పలువురు సీనియర్ నాయకులు బుధవారం పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు.
పన్నీర్ సెల్వం బహిష్కరణ: పార్టీ పదవి నుంచి ఔట్, సంబరాలు
జయలలిత కేసులు వాదిస్తూ పీహెచ్. పాండియన్ అమ్మకు సన్నిహిడయ్యారు. జయలలిత కేసులు, అన్నాడీఎంకే పార్టీకి చెందిన నాయకుల కేసులు అన్నీ దాదాపుగా పీహెచ్. పాండియన్ వాదించారు. జయలలిత ఉన్న సమయంలోనే శశికళను పాండియన్ వ్యతిరేకించారు.
జయలలిత మరణించిన తరువాత శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకించిన వీరందరూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. శశికళ మీద పన్నీర్ సెల్వం తిరుగుబాటు చెయ్యడంతో ఇప్పుడు పార్టీలోని అసమ్మతి నేతలు అందరూ ఏకం అవుతున్నారు.
ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు: నేనే సీఎం, శశికళ
ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జయలలిత మేనకోడలు దీపాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు వారందరూ పన్నీర్ సెల్వం గూటికి చేరుతున్నారు. బుధవారం పన్నీర్ సెల్వం వర్గంలోకి అన్నాడీఎంకే పార్టీ నేతలు అందరూ క్యూ కడుతున్నారు.
శశికళకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు అందరూ ఇప్పుడు ఏకం కావడంతో శశికళ వర్గీయులు హడలిపోతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం ? అని శశికళ వర్గంలోని నాయకులు ఆలోచిస్తున్నారు. వీరికి తోడుగా ఇప్పుడు జయలలిత మేనకోడలు దీపా కలిస్తే శశికళ పరిస్థితి తల్లకిందలు అయిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.