వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన సీఎం పళని, పన్నీర్: అఫిడవిట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేల లిస్ట్ !

భారత ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన ఈపీఎస్, ఓపీఎస్జయలలితకు నిజమైన వారసులు మేమే, అఫిడవిట్లు ఇచ్చిన సీఎం, డీసీఎం గ్రూప్ఈసీకి మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేల వివరాలు, రెండాకులు చిహ్నం మాదే అంటూ ధీమా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు కలిసిపోయాయని, ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి పార్టీ రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భారత ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు.

తమిళనాడు సీఎం పళనిసామికి నైటీ, స్పీకర్ ధనపాల్ కు చీర: రాజీనామా చెయ్యాలని, అరెస్టు !తమిళనాడు సీఎం పళనిసామికి నైటీ, స్పీకర్ ధనపాల్ కు చీర: రాజీనామా చెయ్యాలని, అరెస్టు !

ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం మద్దతుదారులు శుక్రవారం ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని లేఖ ఇచ్చారు. తమ వర్గంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు, వారి పేర్లు, వివరాలు, కొన్ని అఫిడవిట్లు ఎన్నికల కమిషన్ అధికారులకు సమర్పించారు. అక్టోబర్ 5వ తేదీ మద్యాహ్నం 3 గంటలకు రెండాకుల చిహ్నం ఎవరికి కేటాయించామో అనే వివరాలు ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.

AIADMKs two leaves symbol will recover says OPS and EPS

శుక్రవారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. రెండాకుల చిహ్నం మాకే వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గుర్తు మీద పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జయలలితకు, అన్నాడీఎంకే పార్టీకి తామే నిజమైన వారసులని ఈపీఎస్, ఓపీఎస్ చెప్పారు.

సీఎం పళని గూటికి చేరిన రెబల్ ఎంపీ, దినకరన్ ద్రోహి, డీఎంకేతో కలిసి ప్లాన్, లేడీ లీడర్ ఫైర్ !సీఎం పళని గూటికి చేరిన రెబల్ ఎంపీ, దినకరన్ ద్రోహి, డీఎంకేతో కలిసి ప్లాన్, లేడీ లీడర్ ఫైర్ !

అన్నాడీఎంకే పార్టీని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న శశికళ, టీటీవీ దినకరన్, వారి కుటుంబ సభ్యుల చేతికి పార్టీ చిహ్నం ఇవ్వమని అన్నారు. మెజారిటీ ఎంపీలు, శాసన సభ్యులు మా వైపే ఉన్నారని సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గుర్తు చేశారు.

English summary
OPS and EPS team submitted documents in the Election commission. They are demanding double leaf symbol and the party should be given to them. We will definite recover two leaves symbol said OPS and EPS symbol.AIADMK's two leaves symbol before October 31, the poll panel has fixed a hearing in the matter on October 5 at 3pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X