వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పక్షిని డీకొట్టిన విమానం: మంటలు, ల్యాండింగ్
జైపూర్: షార్జా వెళుతున్న విమానాన్ని అత్యావసరంగా ల్యాండ్ చేసిన సంఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. విమానం క్షేమంగా ల్యాండ్ కావడంతో అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బందితో సహా విమానాశ్రయం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అరబ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం షార్జాకు బయలుదేరింది. విమానం గాలిలో ఎగురుతున్న సమయంలో ఒక పెద్ద పక్షి విమానం రెక్కలను ఢీకొంది. పక్షి ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. విషయం గుర్తించిన పైలెట్ అధికారులకు సమాచారం అందించారు.
అధికారుల ఆదేశాల మేరకు విమానాన్ని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపేశారు. విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు. తరువాత విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని నిర్దారించుకున్న తరువాత విమానం షార్జా బయలుదేరి వెళ్లింది.
Comments
English summary
A Sharjah-bound Air Arabia flight with 165 passengers onboard suffered a bird hit during take off at the international airport here forcing the aircraft to land back, airport authorities said.
Story first published: Friday, June 26, 2015, 17:38 [IST]