వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాల్లో ప్రాణాలు: పేలిన ఎయిర్ ఇండియా విమానం టైరు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబై విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. నాగ్‌పూర్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ముంబై విమానాశ్రయంలో రన్ వేపై ల్యాండ్ అవుతుండగా దాని టైరు పేలింది. ఈ సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే పెను ప్రమాదం తప్పడంతో విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

Air India aircraft suffers tyre burst in Mumbai

వివరాల్లోకి వెళితే... నాగ్‌పూర్ నుంచి వచ్చిన ఎయిర్‌బస్ ఎ320 విమానం రన్ వేపై దిగుతుండగా దాని టైరు పేలిపోయింది. ఈ సమయంలో చోటు చేసుకున్న కుదుపులకు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. దాంతో విమానాన్ని టాక్సీవే వద్దకు తీసుకెళ్లి, అక్కడ ఎమర్జెన్సీ విండో ద్వారా ప్రయాణికులందరినీ దించేసినట్లు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

ప్రయాణికులందరినీ విమానంలో నుంచి దించేసిన తర్వాత విమానాన్ని టాక్సీవేలోకి తరలించారు. అయితే ఈ ఘటన జరిగిన కారణంగా ముంబై విమానాశ్రయంలోని ప్రధాన రన్‌వేను మూసేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

English summary
An Air India aircraft with over 150 passengers on board suffered a tyre burst while taxiing after it landed at Mumbai airport from Nagpur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X