ఎయిర్ ఇండియా: విలువైన ఆస్తులను కూడా వదల్లేదు, వాటాల విక్రయంపై కపిల్ సిబాల్
ఎయిర్ ఇండియా 100 శాతం వాటాలను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో పెను దుమారం రేపింది. విపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీ తీరును తప్పుపడుతూ ఒంటికాలిపై లేచింది. మోడీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో ఆస్తులను నమ్మి సొమ్ముచేసుకొంటుందని విమర్శించింది.
ఇది జాతి వ్యతిరేక చర్య, కోర్టును ఆశ్రయిస్తా: ఎయిర్ ఇండియా బిడ్లపై సుబ్రమణ్య స్వామి
ప్రభుత్వం వద్ద నగదు నిల్వలు లేవని, అందుకోసమే ఉన్న ఆస్తులను అమ్ముకుంటు వెళ్తుందని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ విమర్శించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, వృద్ధి రేటు కూడా 5 శాతం కన్నా తక్కువ నమోదవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని గుర్తుచేశారు. ఇలా ముందుకెళ్తే దేశంలో ఉన్న విలువైన వనరులు కనుమరగవుతాయని చెప్పారు.
ఎయిర్ ఇండియాలోని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో వాటాలు అప్పగిస్తామని పేర్కొన్నది. బిడ్లు దాఖలు చేసేందుకు ఆయా సంస్థలకు మార్చి 17 తేదీ గడువుగా నిర్ణయించింది. బిడ్డర్ 3.26 బిలియన్ల రుణం అందజేసి.. ఇతర బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుందని తెలిపింది. 2018లో ఎయిర్ ఇండియా 76 శాతం వాటాను విక్రయించడానికి ప్రయత్నించింది. అయితే అందుకు 5.1 బిలియన్ డాలర్లు కోట్ చేయడంతో.. బిడ్లు దాఖలు చేసేందుకు ఏ సంస్థ ముందుకురాలేదు.