ఏయిర్ఏసియా మరో ఆఫర్: రూ.999కే దేశీ సర్వీసులు
న్యూఢిల్లీ: ఎయిర్ఏసియా విమానయాన సంస్థ ప్రయాణికులకు మరో బంపరాఫర్ ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా రూ.999 ప్రారంభ ధరతో బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, న్యూఢిల్లీ, గౌహతి, జైపూర్, పుణె, ఇంఫాల్ తదితర నగరాలకు (వన్ వే) ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది.
ఈ మేరకు ఆ సంస్థ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, బాలి, ఫుకెట్, మెల్బోర్న్, సిడ్నీ వంటి అంతర్జాతీయ నగరాలకు టికెట్ ప్రారంభ ధరను రూ.3,599గా పేర్కొంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
ఈ సమయంలో బుక్ చేసుకున్న ప్రయాణికులు అక్టోబర్ 4(మంగళవారం) నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 27 వరకు ప్రయాణించవచ్చని తెలిపింది. తమ ఫేస్బుక్ ఫాలోవర్ల సంఖ్య పది లక్షలు దాటడంతో దానిని సెలెబ్రేట్ చేసుకునేందుకే ఈ ఆఫర్ ప్రకటించినట్టు సంస్థ ఇండియా సీఈఓ అమర్ అబ్రోల్ తెలిపారు.