ఎట్టకేలకు ఐశ్వర్యరాయ్, అత్తగారి ఇంట్లోకి.....
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ పెద్దకోడలైన ఐశ్వర్యరాయ్ను ఎట్టకేలకు ఇంట్లోకి అనుమతించారు. గత మూడు నెలలుగా ఆమే ఇంటిలోని అవుట్ హౌజ్లోనే ఉంచుతూ ఇంట్లోకి రానీయకుండా కనీసం అన్నం కూడ పెట్టలేదని ఐశ్వర్యరాయ్ మీడియాకు వివరించిన నేపథ్యంలోనే ఐశ్వర్య అత్త రబ్రీదేవి దిగివచ్చారు. పోలీసుల జోక్యంతో సోమవారం మధ్యహ్నాం అనేక నాటకీయ పరిణామాల మధ్య తన కోడలిని ఇంట్లోకి అనుమతించారు.
హింస, తిండి కూడా పెట్టలేదు: ఐశ్వర్యరాయ్ ఆవేదన, అత్తింటిపై సంచలనం
ఆర్జేడి అధినేత లాలుప్రసాద్ యాదవ్ పెద్ద కోడలు వివాదం గత ఆరునెలలుగా కొనసాగుతోంది. పెళ్లైన కొద్ది రోజులకే విడాకులకు అప్లై చేశారు. దీంతో విడాకుల కేసుపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలనే లాలు ప్రసాద్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ భార్య అయిన ఐశ్వర్య యాదవ్ అత్త మరియు ఆడబిడ్డపై అనేక అరోపణలు చేసింది. రాజ్యసభ సభ్యురాలైన మీసాభారతి కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అరోపణలు చేసింది. ఆమే సమక్షమంలోనే శనివారం రాత్రీ కూడ తనతో దారుణంగా వ్యవహరించారని తెలిపింది. భార్యభర్తల మధ్య ఘర్షణకు ప్రధాన ఆమే కారణమని ఆరోపణలు చేసింది.
దీంతోపాటు ఐశ్వర్య తల్లిదండ్రులైన మాజీ మంత్రి ,ఆర్జేడీ సీనియర్ నాయకుడు చంద్రిక రాయ్,మరియు పూర్ణిమ రాయ్తో కలిసి ఆమే అత్తింటి ముందు భైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఇంటి లోపలికి రానివ్వాలంటూ రబ్రీదేవిపై ఒత్తిడి తెచ్చారు. వీరితో పాటు మరికొంతమంది ఇతర పార్టీల నేతలు సైతం ఈ ఆందోళన పాల్గోన్నారు. దీంతో రాష్ట్ర డీజీపీ రంగంలోకి దిగారు. ఆయన రబ్రీదేవితోపాటు ఆమే కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య రాయ్ సోమవారం మధ్యహ్నం అత్తవారింట్లోకి అడుగు పెట్టింది.