ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూత
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ వ్యవస్థాపకుడు అజిత్ జోగి(74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న ఆయన రాయ్పూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
అజిత్ జోగి మరణ వార్తను ఆయన తనయుడు అమిత్ జోగి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 1946 ఏప్రిల్ 29న బిలాస్పూర్లో జన్మించారు అజిత్ జోగి. ఆయన బోపాల్లోని మౌలానా ఆజాద్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.
రాజకీయాలకంటే ముందు ఐఏఎస్కు ఎంపికైన అజిత్ జోగి మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్ జిల్లాలకు కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఆయన తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
२० वर्षीय युवा छत्तीसगढ़ राज्य के सिर से आज उसके पिता का साया उठ गया।केवल मैंने ही नहीं बल्कि छत्तीसगढ़ ने नेता नहीं,अपना पिता खोया है।माननीय अजीत जोगी जी ढाई करोड़ लोगों के अपने परिवार को छोड़ कर,ईश्वर के पास चले गए।गांव-गरीब का सहारा,छत्तीसगढ़ का दुलारा,हमसे बहुत दूर चला गया। pic.twitter.com/RPPqYuZ0YS
— Amit Jogi (@amitjogi) May 29, 2020
కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు అజిత్ జోగి. 2016లో కాంగ్రెస్ విభేదాల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ పార్టీని స్థాపించారు. గతంలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో తీవ్రంగా గాయపడ్డారు అజిత్ జోగి. ఆ తర్వాత వీల్ ఛైర్ నుంచే రాజకీయాలను కొనసాగించారు. అజిత్ జోగి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.
Recommended Video