వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులు, యువత బీజేపిని సాగనంపేందుకు సిద్దంగా ఉన్నారు..! అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..!!

|
Google Oneindia TeluguNews

లక్నో/హైదరాబాద్ : బీజేపి ప్రభుత్వం పై అఖిలేష్ యాదవ్ మరో సారి మండి పడ్డారు. దేశంలోని యువతలో ఏ విధంగా చైతన్యం వచ్చిందో రైతుల్లో కూడా అదే విధంగా చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు. సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకోవడంతో నేతలు సుడిగాలి పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. యూపీలోని పూర్వాంచల్‌లో ఆజంగఢ్‌, గోరఖ్‌పూర్‌, వారణాసి వంటి పలు కీలక నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్‌ జరగనుండటంతో ఆయా నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆజంగఢ్‌లో ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ బరిలో నిలవగా బీజేపీ తరపున ప్రముఖ భోజ్‌పురి నటుడు దినేష్‌ లాల్‌ యాదవ్‌ తలపడుతున్నారు.

Akhilesh Yadav Claims Farmers And Youth Will Vote Against BJP

పూర్వాంచల్‌ ప్రాంతంలో గతంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు తమ పార్టీకి కలిసివస్తాయని అఖిలేష్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. యువత, రైతులు పెద్దసంఖ్యలో ఎస్పీ వెంట నడుస్తున్నారని చెప్పకొచ్చారు. తమ ప్రభుత్వం ముందుకు తెచ్చిన పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టును గత రెండేళ్లుగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్‌ జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. దేశ యువత, రైతాంగం తమను మోసగించిన మోదీ సర్కార్‌ను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

English summary
Leaders are hoarding campaigns with tornado tours as the end of the universal alliance.The sixth phase of polling in various key constituencies like Azamgarh, Gorakhpur and Varanasi in Uttar Pradesh has been a matter of interest in the constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X