సినిమా పేరు చెప్పగానే మోడీ నవ్వేశారు: మర్చిపోలేనంటూ అక్షయ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రస్తుతం అక్షయ్ ‘టాయ్లెట్-ఏక్ ప్రేమ్కథా’ సినిమాలో నటిస్తున్నారు.
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రస్తుతం అక్షయ్ 'టాయ్లెట్-ఏక్ ప్రేమ్కథా' సినిమాలో నటిస్తున్నారు. మోదీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' క్యాంపెయిన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Met PM @narendramodi and got the opportunity to tell him about my upcoming 'Toilet-Ek Prem Katha.' His smile at just the title made my day! pic.twitter.com/qbvYrlbM2Y
— Akshay Kumar (@akshaykumar) May 9, 2017
ఈ సందర్భంగా అక్షయ్.. మోడీని కలిసి సినిమా గురించి వివరించారు. అయితే అక్షయ్ తన సినిమా టైటిల్ గురించి చెప్పగానే మోడీ నవ్వు ఆపుకోలేకపోయారట. ఈ విషయాన్ని అక్షయ్ ఫేస్బుక్ ద్వారా వెల్లడిస్తూ.. ఆయన నవ్విన క్షణాన్ని మాత్రం మర్చిపోలేనని చెప్పారు.
Pleased to share, @ToiletTheFilm an unusual love story will be with you on 11th Aug, 2017. Tayyar ho jayye Swachch Azaadi ke liye! pic.twitter.com/EEb5bOySu0
— Akshay Kumar (@akshaykumar) March 30, 2017
ఇందులో అక్షయ్కి జోడీగా భూమి పడ్నేకర్ నటిస్తోంది. శ్రీనారాయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. స్వచ్ఛ అజాదీ కోసం అందరూ తయారుగా ఉండాలని మార్చిలో సినిమా పోస్టర్ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు అక్షయ్ కుమార్.