వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాంచీలో పైలట్ సమయస్ఫూర్తితో విమానానికి తప్పిన ప్రమాదం, 180 మంది సేఫ్
రాంచీ: విస్తారా - ఎయిర్ ఇండియా విమానాలకు ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. తాజాగా రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
ఇండిగో ఎయిర్ లైన్స్కు చెందిన 6ఈ 398 విమానం టేకాఫ్కు సిద్ధమయింది. ఈ విమానం రాంచీ నుంచి ఢిల్లీకి వెళ్లవలసి ఉంది. విమానం బయలుదేరే ముందు పైలట్ గ్రౌండ్ రన్ నిర్వహించాడు.
అప్పుడు విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించాడు. వెంటనే టెక్నీషియన్లను పిలిపించాడు. ఆ సమయంలో విమానంలో 180 మంది ఉన్నారు. విమానానికి మరమ్మత్తులు చేసిన తర్వాత దాదాపు రెండు గంటల తర్వాత విమానం బయలుదేరింది. ఉదయం తొమ్మిదిన్నరకు బయలుదేరాల్సిన విమానం మధ్యాహ్నం బయలుదేరింది.
Comments
pilot indigo flight passengers ranchi airport air india flights mumbai ఎయిరిండియా విమానాలు ముంబై పైలట్ రాంచీ విమానం
English summary
It was a close shave for 180 passengers of an IndiGo flight at the Birsa Munda airport in Ranchi. During the take-off of the Ranchi-Delhi fight, the pilot found that the aircraft had some technical fault and abandoned the take-off of flight 6E 398.
Story first published: Tuesday, February 13, 2018, 2:06 [IST]