వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టర్కీలో భారత అథ్లెట్స్ సేఫ్ : విజయ్ గోయల్
బెంగుళూరు : సైనిక మద్దతుదారులకు, ప్రభుత్వ అనుకూల వర్గానికి మధ్య చెలరేగేతున్న హింసాత్మక ఘటనలతో టర్కీ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. దీంతో టర్కీలో ఉన్న భారతీయుల యోగ క్షేమాలపై భారత ప్రభుత్వం ఆరా తీయడం మొదలుపెట్టింది.
ఇందులో భాగంగానే వరల్డ్ స్కూల్ గేమ్స్ లో పాల్గొనెందుకు గాను టర్కీలోని ట్రాబజాన్ కు వెళ్లిన 149 మంది భారత అథ్లెట్ల యోగ క్షేమాలపై ఆరా తీయగా.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ ప్రకటించారు. కాగా, వారి భద్రతకు అవసరమైన అన్ని చర్యలను విదేశీ వ్యవహారాల శాఖ పర్యవేక్షిస్తోందని తెలిపారు.
అథ్లెట్స్ తో పాటు టర్కీలో ఉన్న మరో 200 మంది భారతీయులు కూడా క్షేమంగానే ఉన్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, టర్కీలో జరిగిన దాడుల్లో ఇప్పటిదాకా 190 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Comments
English summary
Union Sports Minister Vijay Goel today said all 149 Indian athletes participating in the World School Games at Trabzon in Turkey are safe, amid an attempted military coup in that country in which at least 60 people have died.
Story first published: Saturday, July 16, 2016, 17:04 [IST]