చైనాకు భారత్ షాక్: ఆ ప్రస్తావన తప్పనిసరి, మోడీ దానిపై మాట్లాడితే అంతే!
అంతర్జాతీయ వేదికపై మోడీ చేసే వ్యాఖ్యలు తమ దేశానికి ఎక్కడ చేటు చేస్తాయోనని చైనా ఆందోళన చెందుతోంది.
న్యూఢిల్లీ: చైనాకు భారత్ షాక్ ఇచ్చింది. బిక్స్ సదస్సులో మోడీ ఎక్కడ డోక్లాం వివాదం ప్రస్తావిస్తారోనన్న ఆందోళనలో ఉన్నా చైనాకు భారత్ పంపిన సంకేతాలతో మరింత భయం పట్టుకుంది.
చైనా ఎందుకు తోక ముడిచింది?: నిజాలివే.. డోక్లాం ప్రతిష్టంభనపై మోడీ అలా చేస్తారనే?
బ్రిక్స్ సదస్సులో డోక్లాం వివాదంతో పాటు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ కు చైనా సహకరిస్తున్న తీరుపై ప్రధాని మోడీ మాట్లాడబోతున్నారన్న సంకేతాలు భారత విదేశాంగ శాఖ పంపించింది.
మోడీ ఆ విషయాలు ప్రస్తావిస్తే అంతర్జాతీయ వేదిక మీద తమ ప్రతిష్టకు భంగం కలుగుతుందని చైనా కలవరపడుతోంది. కాగా, ఈ నెల 4న బీజింగ్ లో జరిగే బ్రిక్స్ సమావేశానికి మోడీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉగ్రవాదం, పాకిస్తాన్ గురించి ప్రస్తావించే అవకాశం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.
బ్రిక్స్ సమావేశానికి హాజరవుతున్న మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు చేస్తారా? అన్నదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే, బ్రిక్స్ సదస్సులో భారత్, రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు పాల్గొంటారు.