ఫిబ్రవరి 2018లోగా ఆధార్ అనుసంధానించాల్సిందే.. లేకుంటే సిమ్ కార్డులు పనిచేయవు
మొబైల్ సిమ్ కార్డుల విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రతి మొబైల్ నెంబరును ఆధార్కు జత చేయడం తప్పనిసరి చేసింది. 2018 ఫిబ్రవరి నాటికి అనుసంధానం పూర్తి చేయకుంటే సిమ్లు పనిచేయవని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: మొబైల్ సిమ్ కార్డుల విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రతి మొబైల్ నెంబరును ఆధార్కు జత చేయడం తప్పనిసరి చేసింది. 2018 ఫిబ్రవరి నాటికి అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. గడువులోగా అనుసంధానం పూర్తి చేయకుంటే సిమ్లు పనిచేయవని స్పష్టం చేసింది.
ఇప్పటికే పలు టెలికాం కంపెనీలు సిమ్ కార్డుకు ఆధార్ను అనుసంధానం చేయాలని కోరుతూ వినియోగదారులకు సందేశాలు పంపుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
లోక్నీతి ఫౌండేషన్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మొబైల్ నంబర్లకు ఆధార్ను అనుసంధానించాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. తప్పుడు చిరునామాలతో నకిలీ సిమ్కార్డులు తీసుకొని ఉపయోగిస్తున్న నేరస్థులు, మోసగాళ్లు, ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.
సిమ్ కార్డు విక్రయ సమయంలో వినియోగదారుడి ఫింగర్ ప్రింట్ ను బయోమెట్రిక్ విధానంలో తీసుకొని దాన్ని ఆధార్తో సరిపోల్చి నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుంది. మరింకేంటి.. త్వరపడండి.. గడువులోగా మీ సిమ్ కార్డును ఆధార్ తో అనుసంధానించండి!