వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాళం వేసిన ఇంట్లో ఐదు మృతదేహాలు: ఫ్రిజ్, సూట్‌కేసులలో 4గురు మహిళల బాడీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అలహాబాద్: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇటీవల రెండు ప్రాంతాల్లో సామూహిక ఆత్మహత్యలు చోటు చేసుకున్న ఉదంతాలు కలకలం రేపాయి. తాజాగా అలహాబాదులోని జరిగింది. ఓ కుటుంబంలోని 5గురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు.

చనిపోయినవారిలో ఓ పురుషుడు, నలుగురు మహిళలు ఉన్నారు. నలుగురు మహిళల్లో ఒకరు ఆ పురుషుడి భార్య కాగా, మిగతా ముగ్గురు కూతుళ్లుగా గుర్తించారు.

Allahabad shocker: Five of family, including four women, found dead inside locked home

ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. వ్యక్తి ఉరి వేసుకొని చనిపోయాడని చెప్పారు. అతని భౌతికకాయం సీలింగ్‌కు వేలాడుతూ కనిపించిందన్నారు. అతని భార్య మృతదేహం ఫ్రిజ్‌లో కనిపించిందన్నారు. మిగతా ముగ్గురు కూతుళ్ల మృతదేహాలు సూటుకేసు, అల్మారా, ఓ గదిలో కనిపించాయని తెలిపారు.

ప్రాథమిక సమాచారం ఆధారంగా ఆ వ్యక్తి భార్యను, ముగ్గురు కూతుళ్లను చంపేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఐదుగురి మృతదేహాలు కూడా తాళం వేసిన ఇంటిలో గత రాత్రి కనిపించాయని తెలిపారు.

వారి మృతికి గల కారణాలు ఇప్పుడే ఏం చెప్పలేమని అన్నారు. అలాగే, వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయా తెలియాల్సి ఉందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
In a shocking case reported out of Allahabad, the police recovered the body of a man, and his family members that comprised his wife and three daughters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X