తాళం వేసిన ఇంట్లో ఐదు మృతదేహాలు: ఫ్రిజ్, సూట్కేసులలో 4గురు మహిళల బాడీలు
అలహాబాద్: ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. ఇటీవల రెండు ప్రాంతాల్లో సామూహిక ఆత్మహత్యలు చోటు చేసుకున్న ఉదంతాలు కలకలం రేపాయి. తాజాగా అలహాబాదులోని జరిగింది. ఓ కుటుంబంలోని 5గురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు.
చనిపోయినవారిలో ఓ పురుషుడు, నలుగురు మహిళలు ఉన్నారు. నలుగురు మహిళల్లో ఒకరు ఆ పురుషుడి భార్య కాగా, మిగతా ముగ్గురు కూతుళ్లుగా గుర్తించారు.
ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. వ్యక్తి ఉరి వేసుకొని చనిపోయాడని చెప్పారు. అతని భౌతికకాయం సీలింగ్కు వేలాడుతూ కనిపించిందన్నారు. అతని భార్య మృతదేహం ఫ్రిజ్లో కనిపించిందన్నారు. మిగతా ముగ్గురు కూతుళ్ల మృతదేహాలు సూటుకేసు, అల్మారా, ఓ గదిలో కనిపించాయని తెలిపారు.
Police recovered bodies of a man,his wife & three daughters from a locked house in Allahabad last night. Body of the man was found hanging, his wife's body was found inside the fridge, bodies of two daughters were found in suitcase & almirah and one daughter was found in the room pic.twitter.com/c6GIR405J1
— ANI UP (@ANINewsUP) August 21, 2018
ప్రాథమిక సమాచారం ఆధారంగా ఆ వ్యక్తి భార్యను, ముగ్గురు కూతుళ్లను చంపేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఐదుగురి మృతదేహాలు కూడా తాళం వేసిన ఇంటిలో గత రాత్రి కనిపించాయని తెలిపారు.
Prima facie, it seems that the man killed his wife and daughters, and later committed suicide. Investigation underway: Allahabad SSP Nitin Tiwari on bodies of 5 people found at a locked in Dhumanganj last night. pic.twitter.com/7iVJK8NuUK
— ANI UP (@ANINewsUP) August 21, 2018
వారి మృతికి గల కారణాలు ఇప్పుడే ఏం చెప్పలేమని అన్నారు. అలాగే, వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయా తెలియాల్సి ఉందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.