వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నడుస్తున్న రైలులో.. ఏసీ కోచ్‌లో.. వివాహిత దారుణ హత్య

|
Google Oneindia TeluguNews

జైపూర్‌ : ఇండోర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. ఓ వివాహితను దుండగులు హత్యం చేయడం కలకలం రేపింది. ఆళ్వార్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సదరు ట్రైన్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకుని పాశవికంగా హత్య చేశారు.

ఆన్‌లైన్ గేమ్స్.. ప్రాణాలు తీస్తున్నాయి.. కాపురాలు కూల్చుతున్నాయి..!ఆన్‌లైన్ గేమ్స్.. ప్రాణాలు తీస్తున్నాయి.. కాపురాలు కూల్చుతున్నాయి..!

ఆళ్వార్‌కు చెందిన అంజు, భర్త జితేంద్ర యాదవ్‌, రెండేళ్ల కుమారుడితో కలిసి ఆదివారం రాత్రి ఇండోర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఆమె తన కుమారుడితో కలిసి 25వ బెర్త్‌ పైన నిద్రించగా.. జితేంద్ర 28వ బెర్త్‌పైన నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి దాటాక 2 నుంచి 3 గంటల సమయంలో కుమారుడి ఏడుపు విని నిద్రలేచిన జితేంద్ర షా కు భార్య కనిపించలేదు. దాంతో వాష్‌రూమ్‌లో ఉందేమోనన్న అనుమానంతో అక్కడికి వెళ్లి చూడగా షాక్ తిన్నాడు.

alwar married woman murdered in indoor intercity express

బాత్రూమ్‌లో అంజు శవమై కనిపించింది. దుప్పటితో ఆమెకు ఉరి బిగించి ఉన్నట్లు గుర్తించాడు. దాంతో వెంటనే చైన్‌లాగి రైలుని ఆపాడు. రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆ రైలు దగ్గరకు చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని మొదటగా చిత్తోర్‌ఘర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం అక్కడి నుంచి సమీప ప్రభుత్వాసుపత్రికి పంపించారు.

దొంగలు ఆమె ఒంటిపై ఉన్న నగల్ని దోచుకున్న తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహంపై గాయాలున్నట్లు కూడా గుర్తించారు. ఆ క్రమంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

English summary
Alwar Married Woman Murdered In Indoor Intercity Express. The thieves theft her gold ornaments and murdered cruelly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X