అమర్నాథ్ యాత్రలో విషాదం: బస్సు లోయలో పడి 16 మంది మృతి
అమర్నాథ్ యాత్రలో విషాధం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, 35 మందికి గాయాలయ్యాయి.
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో విషాధం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి.
జమ్ము జాతీయ రహదారిలో ఉన్న రంబన్ ప్రాంతంలోని నాచ్ నల్లా వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. బస్సు జమ్ము నుంచి పహెల్గాం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కాగా,అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో మరొకరు మృతి చెందారు. 47 ఏళ్ల మహిళా యాత్రికురాలు లలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది.
జులై 10న అనంత్నాగ్ జిల్లాలోని బటంగూ వద్ద యాత్రికులు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు అమానుషంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.