అమెజాన్, ఫ్లిప్కార్ట్ బంఫర్ ఆఫర్లు: మొబైల్స్, టీవీలపై క్యాష్బ్యాక్, డిస్కౌంట్లు
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు ఈ నెల 14 నుండి 17 వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించాయి. ఈ ఆఫర్లను వినియోగించుకొనేవారికి భారీ డిస్కౌంట్లతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించాయి. నో కాస్ట్ ఈఎంఐ సదుప
న్యూఢిల్లీ: ఈ- కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లు పోటీలు పడి పండగ ఆఫర్లను ప్రకటించాయి.అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 17 వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను నిర్వహిస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. సరిగ్గా అదే రోజుల్లో ఫ్లిప్కార్ట్ కూడ భారీ ఆఫర్లను ప్రకటించింది.
మళ్లీ డిస్కౌంట్ల ఉత్సవం ప్రారంభం కాబోతుంది. ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండూ ఒకేసారి తన సేల్ ఆఫర్లకు తెరతీయబోతున్నాయి. అమెజాన్ తన తర్వాతి ఎడిషన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలను బహిర్గతం చేసింది.
అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 17 వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను నిర్వహించనున్నట్టు పేర్కొంది. అదే రోజుల్లో ఫ్లిప్కార్ట్ కూడా తన బిగ్ దివాలి సేల్ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది ప్లిప్కార్ట్. అమెజాన్ ఈ దివాలి సేల్లో భాగంగా మొబైల్, యాక్ససరీస్, టీవీలు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై డీల్స్ను అందించనున్నట్టు తెలిపింది.
ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు ఈ సేల్లో అదనంగా 10 శాతం క్యాష్బ్యాక్ కూడా వచ్చేస్తుంది. 30వేల వరకు ఉత్పత్తులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.500 క్యాష్బ్యాక్ను అందించనున్నట్టు పేర్కొంది. మొబైల్ఫోన్లపై 40 శాతం యాక్ససరీస్పై 80 శాతం డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది.
,పవర్ బ్యాంకులపై 65 శాతం, మొబైల్ కేసులపై 80 శాతం వరకు, బ్లూటూత్ హెడ్సెట్లపై 20 శాతం వరకు తగ్గింపును ఇవ్వనుంది. ఇతర కేటగిరీ ఉత్పత్తులు టీవీలపై 40 శాతం, ల్యాప్టాప్లపై రూ.20వేలు , హెడ్ఫోన్లు, స్పీకర్లపై 60 శాతం, , స్టోరేజ్ డివైజ్లపై 50 శాతం,, వీడియో గేమ్లపై 60 శాతం,, నెట్వర్కింగ్ డివైజ్లపై 60 శాతం తగ్గింపును యూజర్లు పొందే అవకాశం ఉంది..ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్డెన్ అవర్స్ డీల్స్ను అమెజాన్ ఆఫర్ చేయనుంది. స్పెషల్ ధన్తెరాస్ ఆఫర్లు కూడా ఉన్నాయి.