వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా మరో దుశ్చర్య: హిందువులకు పవిత్రమైన కైలాస మానసరోవరంలో మిస్సైల్ లాంఛర్లు - టెన్షన్

|
Google Oneindia TeluguNews

ఒక వైపు చర్చల్లో పాల్గొంటూనే.. మరోవైపు వరుస ఉల్లంఘనలకు పాల్పడుతూ.. భరాత్ తో కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. గడిచిన నాలుగు నెలలుగా తూర్పు లదాక్ లోని వివిధ ప్రాంతాల్లో కవ్వింపులకు దిగిన డ్రాగన్ బలగాలు.. తాజాగా చుశూల్ సెక్టార్ లో సరిహద్దుల్ని చెరిపేసేందుకు విఫలయత్నం చేశాయి. ఈ ఉదంతంపై వివాదం కొనసాగుతుండగానే.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస మానసరోవరం దగ్గరా డ్రాగన్ సైనిక చర్యల్ని ముమ్మరం చేసినట్లు రిపోర్టులు వచ్చాయి.

Recommended Video

Ladakh Face Off : India - China బలగాల మధ్య ఘర్షణ.. భారత్ లోకి దూసుకొచ్చేందుకు China యత్నం!

చైనా దురాక్రమణ: ప్రధాని మోదీ వరుస భేటీలు - మంత్రి కిషన్ రెడ్డికి ఎల్‌జీ బ్రీఫింగ్ - అటు సైనిక చర్చలుచైనా దురాక్రమణ: ప్రధాని మోదీ వరుస భేటీలు - మంత్రి కిషన్ రెడ్డికి ఎల్‌జీ బ్రీఫింగ్ - అటు సైనిక చర్చలు

కైలాస శిఖరం, సరోవర సరస్సును కలిపి కైలాస మానసరోవరంగా పిలుచుకోవడం తెలిసిందే. సైనిక పరంగానూ కీలక మైన ఆ ప్రాంతంలో చైనా కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు గతంలోనే వెల్లడైంది. అయితే, అక్కడ మిస్సైల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మాత్రం తాజాగా బయటపడింది. హిందువుల పవిత్ర స్థలాలకు సమీపంగా చైనా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నది.

Amid border tensions with India, China constructs missile site at Kailash-Mansarovar

సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో, సుమారు 80 కి.మీ. పొడవున చైనా సైనిక నిర్మాణాలు, వాహనాలు, బలగాల మోహరింపునకు సంబంధించిన దృశ్యాలు శాలిలైట్ల ద్వారా వెలుగులోకి వచ్చాయి. భూతలంపైనుంచి ఆకాశంలో గల టార్గెట్లను ఛేదించగల మిసైళ్లను కూడా చైనా మోహరించింది. ఇప్పటికే తూర్పు లదాక్ అంతటా ఉద్రిక్తతలు నెలకొన్నవేళ తాజాపరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తున్నది.

చైనా దురాక్రమణ: ప్రధాని మోదీ వరుస భేటీలు - మంత్రి కిషన్ రెడ్డికి ఎల్‌జీ బ్రీఫింగ్ - అటు సైనిక చర్చలు<br>చైనా దురాక్రమణ: ప్రధాని మోదీ వరుస భేటీలు - మంత్రి కిషన్ రెడ్డికి ఎల్‌జీ బ్రీఫింగ్ - అటు సైనిక చర్చలు

Amid border tensions with India, China constructs missile site at Kailash-Mansarovar

తూర్పు లదాక్ లో తాజా పరిస్థితిపై హోం, రక్షణ శాఖలు నిరంతరాయంగా ప్రధాని నరేంద్ర మోదీకి బ్రీఫింగ్ ఇస్తున్నాయి. ఈనెల 29-30 అర్ధరాత్రి జరిగిన సంఘటనల్లో హింస చోటుచేసుకోలేదని, సరిహద్దులు చెరిపేసేందుకు చైనా ప్రయత్నించగా, భారత్ అడ్డుకుందని ఆర్మీ వెల్లడించింది. అయితే, ఇది వట్టి ఆరోపణే అని, చైనీస్ ఆర్మీ ఎల్ఏసీని దాటలేదని ఆదేశ విదేశాంగ శాఖ ప్రకటించుకుంది.

English summary
Amid tensions with India over the standoff in Eastern Ladakh sector, China has reportedly built a surface-to-air missile near a lake, which is a part of the Kailash-Mansarovar. China’s latest attempt to change the status quo by carrying out “provocative military movements" in Ladakh led heavy tension at border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X