అంతా అమిత్ షా వల్లే.. మోడీకి చెప్పకపోవడం వల్లే మహా సంక్షోభం: సంజయ్ రౌత్
మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభనకు బీజేపీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కారణమని శివసేన ఆరోపించింది. ఎన్నికలకు ముందు శివసేన డిమాండ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి.. ఆ పార్టీ చీఫ్ అమిత్ షా వివరించలేదని పేర్కొన్నది. సీఎం పోస్టు సహా కీలక అంశాలను దాచేయడం వల్లే కూటమిలో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయని గుర్తుచేసింది. మహా సంక్షోభం గురించి మాట్లాడుతూ...
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనే శరణ్యమా..? శివసేనకు గవర్నర్ మరో ఛాన్స్ ఇస్తారా...?
50-50 ఫార్ములా
మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు తమ పార్టీ అధినేత ఉద్దవ్ థాకరేతో కలిసి అమిత్ షా 50-50 ఫార్ములా గురించి చర్చించారని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఉద్దవ్ థాకరే వద్ద ఒప్పందానికి షా అంగీకరించి.. ఆ మాటను మోడీ వద్ద దాచిపెట్టారని విమర్శించారు. దీంతో ఎన్నికల తర్వాత సీఎం సీటు వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరిగిందని గుర్తుచేశారు.
ఉద్దవ్ కూడా..
ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ, అమిత్ షా తమ సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ అని చెప్పారు. ఆ విషయాన్ని బుధవారం అమిత్ షా మీడియాకు తెలిపారు. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ కూడా స్పందించారు. మోడీ, అమిత్ షా అలా చెబితే.. ఉద్దవ్ థాకరే కూడా శివసేన నుంచి సీఎం అభ్యర్థి అని పలు వేదికలపై పేర్కొన్న విషయాన్ని ‘ఇండియా టుడే’తో చెప్పారు. ఉద్దవ్ అలా చెబుతుంటే అమిత్ షా ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. ఆ అంశంపై ఇప్పుడేందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఎందుకు దాచారు...
శివసేన పార్టీ ప్రధాని మోడీని గౌరవిస్తుందని సంజయ్ రౌత్ చెప్పారు. కానీ ఉద్దవ్తో జరిగిన సమావేశ వివరాలను తెలియజేయడంలో అమిత్ షా విఫలమయ్యారని తప్పుపట్టారు. ఉద్దవ్ నివాసంలో అమిత్ షా సమావేశమయ్యారని.. అదీ బాల్ థాకరే డ్రాయింగ్ గదిలో భేటీ జరిగిందని రౌత్ గుర్తుచేశారు. అదీ బీజేపీ నేతలకు గది కానీ.. తమకు దేవాలయం అని పేర్కొన్నారు. అలాంటి చోట జరిగిన విషయాన్ని కూడా అమిత్ షా దాచిపెట్టారని మండిపడ్డారు. ఇది ఆలయమో, బాల్ థాకరేనో తక్కువ చేయడం కాదు.. మహారాష్ట్రీయులను చిన్నచూపు చూడటం అవుతుందన్నారు.
Recommended Video
మాట మార్చి, మాట తప్పి
రాజకీయాల్లో శివసేన ఎప్పుడూ లాభనష్టాలను బేరీజు వేసుకోదని సంజయ్ రౌత్ స్పష్టంచేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాటుపడదని చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాలిస్తోందని చెప్పారు. ఆత్మభిమానాన్ని చంపుకోదని.. ఉన్నది ఉన్నట్టు స్పష్టం చేస్తుందని తెలిపారు. కానీ బీజేపీ, అమిత్ షా వైఖరి సరికాదని విమర్శించారు.