ఆసుపత్రిలో చేరిన అమిత్ షా: లిపోమా సర్జరీ
అహ్మదాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఉదయం ఆయన గుజరాత్ అహ్మదాబాద్ లోని కుసుమ్ ధీరజ్ లాల్ ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు డాక్టర్లు. లిపోమా శస్త్ర చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ ఏడాది జనవరిలో ఆయన స్వైన్ ఫ్లూ బారిన పడ్డ విషయం తెలిసిందే. దీనికోసం ఆయన న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం మరోసారి స్వైన్ ఫ్లూ సోకినట్లు వార్తలు వచ్చినప్పటికీ..
ఒక్క సెకెన్ తేడా వచ్చినా..: ఇస్రో హిస్టరీలోనే అత్యంత కీలక దశ: మాజీ ఛైర్మన్
కుటుంబ సభ్యులు వాటిని తోసి పుచ్చారు. మెడ వెనుక భాగంలో లిపోమా శస్త్ర చికిత్స చేయించుకోవాలనే ఉద్దేశంతో స్థానిక ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించారు. సాయంత్రం డిశ్చార్జి అవుతారని చెప్పారు. శ్వాస పీల్చుకోవడంలో స్వల్పంగా ఇబ్బందులు తలెత్తినందు వల్ల లిపోమాతో పాటు ముక్కుకు సర్జరీ అవసరమైందని డాక్టర్లు తెలిపారు.
తమ బంధువుల ఇంట్లో ఓ శుభ కార్యానికి హాజరు కావడానికి ఈ ఉదయం న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు బయలుదేరి వెళ్లిన అమిత్ షా నేరుగా.. వైష్ణోదేవి సర్కిల్ సమీపంలో ఉన్న కుసుమ్ ధీరజ్ లాల్ ఆసుపత్రిలో చేరారు.