2100 మంది రైతుల బ్యాంకు అప్పులను చెల్లించిన హీరో అమితాబ్...
హీరోలంటే సినిమాలు తీయడం డబ్బులు సంపాదించుకోవడం.. అప్పుడడప్పుడు దానాలు చేయడం...ఇలా కోట్ల రుపాయలు సంపాదించుకున్న వారు సైతం ఇదే చేస్తారు. కాని సినిమా హీరోల్లో బాలివుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ లివింగ్ స్టైల్ వేరు..ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోని సిని పరిశ్రమలో నిలదొక్కుకున్న అమితాబ్ అడపాదడపా కాకుండా నిరంతరం ప్రజా సేవ చేయడంలో ముందుంటాడు.ఇందులో భాగంగానే మరోసారి తన దాతృత్వాన్ని నిరూపించుకున్నాడు.
నాలుగోసారి:
నీరవ్
మోడీ
బెయిల్
మంజూరుకు
నిరాకరించిన
యూకే
హైకోర్టు
మెగాస్టార్ అమితాబ్బచ్ఛన్ మరోసారి రియల్ హీరో అయ్యాడు. ఈసారి రైతులను ఆదుకుని వారి అప్పులను తీర్చాడు. ఈనేపథ్యంలోనే అమితాబ్ బిహార్లోని 2100మంది రైతుల అప్పులను వన్టైం సెటిల్మెంట్ క్రింద బ్యాంకులకు తిరిగి చెల్లించాడు. దీనికి సంబంధించి ఆయన తన బ్లాగ్లో పేర్కోన్నాడు.
కాగా రైతుల అప్పులకు సంబంధించిన పత్రాలను తన కూతురు శ్వేతబచ్చన్ వారికి అందించారు. ఈ కార్యక్రమంలో హిరో అభిషేక్ బచ్ఛన్ కూడ పాల్గోన్నాడు. ఇక అమితాబ్ బచ్చన్ రైతుల అప్పులను చెల్లించడం మొదటి సారి కాదు, గత సంవత్సరం కూడ ఉత్తరప్రదేశ్కు చెందిన 1000 మంది రైతులను బ్యాంకు రుణాల నుండి విముక్తి కల్గించాడు. కాగా ఇదే విషయాన్ని ''మరో హామీని నెరవేర్చానని'' తన బ్లాగ్లో రాశాడు.