భారత్ వర్సెస్ వెస్టిండీస్: గేల్ ఫోటో పెట్టిన అమితాబ్
ముంబై: వెస్టిండీస్ - భారత్ మ్యాచ్కు ముందు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ ఫోటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లోని తన ఖాతాలో గేల్ ఫోటోను ఉంచారు.
ఇటీవల అమితాబ్ బచ్చన్ ఆతిథ్యం తనని ముగ్ధుడిని చేసిందని క్రిస్గేల్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. తనకు ఎంతో ఇష్టమైన నటుడి నుంచి ఊహించని ఆతిథ్యం అందుకోవడంతో క్రిస్గేల్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
అమితాబ్ బచ్చన్కి క్రిస్గేల్ వీరాభిమాని. అమితాబ్ ఇచ్చిన ఆతిథ్యం పట్ల క్రిస్గేల్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ మేరకు బిగ్ బీ అమితాబ్ తనని ఇంటికి పిలిచి.. విందు ఇచ్చాడని, ఆయన ఆతిథ్యం తనను ముగ్ధుడిని చేసిందని గేల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో వెల్లడించాడు.
T 2191 - Large left over cut outs of my 70th birthday celebration in drive way of my office, and THE MAN Chris Gayle pic.twitter.com/uPGbZgK9xZ
— Amitabh Bachchan (@SrBachchan) March 30, 2016
'మీ ఇంటికి పిలిచి ఆతిథ్యమిచ్చినందకు కృతజ్ఞతలు. చాలా పుస్తకాలు కూడా కానుకగా ఇచ్చారు. బాస్ నేను సెంచరీ కొట్టాలి, కానీ ఇండియానే గెలువాలని కోరుకున్నారు. నేను మాత్రం సెంచరీ కొట్టకపోయినా పర్వాలేదు మేము గెలువాలని కోరుకుంటున్నా' అని జైమకైన్ స్టార్ బ్యాట్స్మెన్ క్రిస్గేల్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నాడు. కాగా, ఈ రోజు మ్యాచులో అమితాబ్ మాట నెగ్గుతుందా, గేల్ మాట నెగ్గుతుందా చూడాలి.