ఆమ్నెస్టీ కార్యాలయలపై సీబీఐ దాడులు.. విదేశాల నుంచి అక్రమంగా నిధుల మళ్లింపు...
స్వచ్చంద సంస్థ ఆమ్నెస్టీ కార్యాలయాలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ, బెంగళూరులో ఏకకాలంలో రైడ్స్ చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్-2010 నిబంధనలను ఉల్లంఘించారని సీబీఐ పేర్కొన్నది.
ఈ మేరకు సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. బెంగళూరు. ఢిల్లీలో గల ఆమ్నెస్టీ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించిన 13 నెలల తర్వాత సీబీఐ రైడ్ చేసింది.
ఆమ్నెస్టీ కార్యాలయం మానవ హక్కుల కోసం పోరాడుతుంది. దేశంలో జరిగే ఘటనలపై స్పందిస్తోంది. అయితే తాము మానవ హక్కుల ఉల్లంఘనపై స్పందించినందుకే సీబీఐ దాడులు చేసిందని కంపెనీ పేర్కొన్నది. అంతర్జాతీయ చట్టం ప్రకారమే భారత్లో ఆమ్నెస్టీ సంస్థ పనిచేస్తుందని తెలిపింది. భారతే కాదే ఎక్కడైనా మానవ హక్కుల కోసం పోరాడుతామని చెప్పింది. ఇప్పటిలాగే అదే విలువలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
విదేశీ నిధులకు సంబంధించి ఆమ్నెస్టీ నిబంధనలను ఉల్లంఘించిందని అధికారులు చెప్తున్నారు. రూ. 36 కోట్లకు సంబంధించి సరైన వివరాలు లేవని పేర్కొన్నది. కార్యాలయంలో ఉన్న అధికారులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆఫీసు నుంచి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.