రైలు ప్రమాదం తర్వాత కనిపించని నిర్వాహకులు, సిద్ధూ రాజీనామాకు డిమాండ్
అమృత్సర్: పంజాబ్లో రైలు ప్రమాదం జరిగిన సమీపంలో ఓ పది నెలల బాబు కనిపించింది. అమృత్సర్ రైలు ట్రాక్ సమీపంలో గుర్తించారు. కానీ అతని తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా ఉంది. రైలు ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత ఆ బాబును పోలీసులు గుర్తించారు. ఆ బాబు గురించి ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
విషాదంలో రెచ్చిన దొంగలు: రైలు డ్రైవర్ సడన్ బ్రేక్వేస్తే ఇంకా ఘోరం!, సిద్ధూ భార్య ఆలస్యంగా రావడంతో
ఇదిలా ఉండగా, రావణ దహన కార్యక్రమ నిర్వహకులు జనాగ్రహానికి గురవుతున్నారు. ఆ స్థలంలో ఉత్సవం నిర్వహించి 61 మందిని పొట్టనబెట్టుకున్నాడని స్థానిక కార్పొరేటర్ కుమారుడు సౌరభ్ మదన్ మిథుపై అందరూ మండిపడుతున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం కార్పొరేటర్ విజయ్ మదన్ ఇంటిపై బాధితులు రాళ్ల దాడి జరిగింది.
ప్రస్తుతం తండ్రీకొడుకులు ఇద్దరూ కనిపించడం లేదు. ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. దీంతో బాధితులు కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ప్రమాదం జరిగి రెండు రోజులు అయినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని బాధితులు ఆగ్రంహ వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఆందోళనలు కూడా చేపట్టారు.
మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ సతీమణి రావణ దహన ఉత్సవానికి ముఖ్య అతిథిగా రావడంతో.. సిద్దూ రాజీనామా చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. జోడా పాఠక్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్థానికులంతా తమ ఇళ్లలోనే ఉండాలని పోలీసులు సూచించారు. ప్రమాదం జరిగిన స్థలంలోనే పట్టాల వద్ద శనివారం ఆందోళన చేస్తున్న స్థానికులను పోలీసులు చెదరగొట్టారు. దీంతో పోలీసులపైకి బాధితులు రాళ్లు రువ్వారు.