మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి చిక్కుల్లో పడ్డ సీఎం సతీమణి!
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత వివాదంలో చిక్కుకున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబితే వివాదం ఎలా అవుతుందనుకుంటున్నారా? అయితే, ఆమె పుట్టిన రోజు చెప్పడంతో మరో వ్యాఖ్య కూడా చేశారు.
ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అమృత ఫడ్నవీస్.. ఆయనను జాతిపితగా అభివర్ణించారు. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'ఫాదర్ ఆఫ్ అవర్ కంట్రీ నరేంద్ర మోడీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేస్తున్న మీరు మా అందరికీ ఆదర్శప్రాయం' అని అమృత తన ట్విట్టర్ ఖాతాలో సోమవారం పోస్టు చేశారు. కాసేపటికే ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది.
Wishing the Father of our Country @narendramodi ji a very Happy Birthday - who inspires us to work relentlessly towards the betterment of the society ! #HappyBDayPMModiJi #HappyBdayPMModi #HappyBirthdayPM #happybirthdaynarendramodi pic.twitter.com/Ji2OMDmRSm
— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) September 17, 2019
దీంతో నెటిజన్లు కామెంట్లు చేయడం ప్రారంభించారు. మన జాతిపతి మహాత్మా గాంధీ కాదా.. ఇప్పుడు కొత్తగా ఫాదర్ ఆఫ్ అవర్ కంట్రీ ఎంటీ? అంటూ మండిపడ్డారు. అంతేగాక, ప్రధాని మోడీ ఎప్పుడు ఫాదర్ ఆఫ్ అవర్ కంట్రీ అయ్యారు? ఎలా అయ్యారు? అంటూ విరుచుకుపడ్డారు.