నేను జయలలిత కుమార్తెను: మద్రాసు హైకోర్టులో పిటిషన్, డీఎన్ఏ పరీక్షలు చెయ్యండి !
బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె నేను అంటూ మీడియా ముందుకు వచ్చిన బెంగళూరు మహిళ అమృత ఇప్పుడు మద్రాసు హైకోర్టు ఆశ్రయించడానికి సిద్దం అయ్యింది. అందుకు సంబంధించిన పిటిషన్ పత్రాలు సిద్దం చేశారు.
తాను తమిళనాడు దింగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని, అమ్మకు హిందూ సాంప్రధాయం ప్రకారం అంత్యక్రియులు చెయ్యడానికి మళ్లీ అవకాశం ఇవ్వాలని బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీం కోర్టుకు ఎందుకు వచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే అక్కడ తమకు శాంతిభద్రతల సమస్య వస్తోందని అమృత తరపు న్యాయవాది వాదించారు. అయితే కర్ణాట హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు సూచించింది.
అయితే మద్రాసు హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చెయ్యాలని అమృత నిర్ణయించింది. అమృత తరపు న్యాయవాది శుక్రవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని గురువారం సాయంత్రం తమిళ మీడియా వార్తలు ప్రసారం చేసింది.