వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ అంబులెన్స్ లో మంటలు: పైలెట్ మృతి, డాక్టర్లకు !

|
Google Oneindia TeluguNews

బ్యాంకాక్: మేదాంత ఆసుపత్రికి చెందిన ఎయిర్ అంబులెన్స్ విమానంలో ఆకస్మికంగా మంటలు వ్యాపించి పైలెట్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఐదు మంది ప్రయాణిస్తున ఎయిర్ అంబులెన్స్ ను అత్యవసరంగా కిందకు దించివేయడంతో ముగ్గురికి తీవ్రగాయాలైనాయి.

విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి బ్యాంకాక్ కు మేధాంత ఆసుపత్రి ఎయిర్ అంబులెన్స్ బయలుదేరింది. మార్గం మధ్యలో కోల్ కతాలో ఎయిర్ ఆంబులెన్స్ కు ఇంధనం నింపారు.

తరువాత ఎయిర్ అంబులెన్స్ బ్యాంకాక్ బయలుదేరింది. మార్గం మధ్యలో ఎయిర్ అంబులెన్స్ లో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. వెంటనే నఖమ్ పాథమ్ విమానాశ్రయంలో ఎయిర్ అంబులెన్స్ ను ఆకస్మికంగా కిందకుదించేశారు.

 An Air Ambulance of Medanta Hospital with a five member crew crash landed after it caught fire near Bangkok.

అయితే అప్పటికే మంటలు వ్యాపించడంతో పైలెట్ అరుణాక్ష నంది సంఘటనా స్థలంలోనే మరణించారు. తీవ్రగాయాలైన డాక్టర్ శైలేంద్ర, డాక్టర్ కోమల్ లను బ్యాంకాక్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో మరో నర్సుకు గాయాలు కావడంతో ఆమెకు అక్కడే చికిత్స అందిస్తున్నారని సుష్మా స్వరాజ్ ట్వీట్టర్ లో తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన పైలెట్ కుటుంబ సభ్యులకు సుష్మా స్వరాజ్ ప్రగాడసానుభూతి తెలిపారు.

English summary
An Air Ambulance of Medanta Hospital with a five member crew crash landed after it caught fire near Bangkok. The pilot died while four others including two doctors and a nurse were injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X