బైక్పై డ్రాప్కు నిరాకరించినందుకు రాడ్లతో దాడి...!
యాప్ బుక్ చేయకుండా బైక్ డ్రాప్ చేయడానికి తిరస్కరించిన బైక్ డ్రైవర్ను కొంతమంది దుండగులు కాపుకాసి దాడి చేశారు..ఒక్కడిని చేసి మొత్తం 20 మంది యువకులు బైక్ డ్రైవర్ను ఐరన్ రాడ్లు, ప్లాస్టిక్ పైప్లతో దాడి చేశారు. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ క్యాబ్ డ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చారు.
కోల్కతాలో టూ వీలర్ బేస్డ్ బైక్ డ్రైవర్ ను కోంతమంది దుండగులు అడ్డగించి దాడులు చేశారు...యాప్లో బుక్ చేయకుండా బైక్ డ్రాప్ చేయాలని 27 సంవత్సరాల అజయ్ సాహును అడిగారు. అయితే అజయ్ అందుకు నిరాకరించడంతో కక్షతో అజయ్ని అడ్డగించారు..సుమారు 20 మంది ఆయనపై మూకుమ్మడి దాడి చేశారు..దీంతో తీవ్రగాయాల పాలైన బైక్ డ్రైవర్ను హౌరాలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు...
కాగా డ్రైవర్పై దాడులు చేయడంతో తమకు రక్షణ కల్పించాలని హౌరాలోని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు...నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ క్యాబ్ల బంద్కు పిలుపునిచ్చారు.కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..అయితే ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.