ఏనుగు పిల్ల శవయాత్రను నిర్వహించిన తోటి ఏనుగులు...!
నెట్టింట్లో ఓ వీడియో హల్చల్ చేస్తుంది...చనిపోయిన ఏనుగు పిల్లను దహన సంస్కరాలు చేసేందుకు ఏనుగులన్ని కలిసి వెళుతున్న వీడీయోను చూసి నెటిజన్ల హర్ట్ బ్రేక్ అవుతుంది... మారుతున్న సామాజిక జీవనంలో మనుషులు జంతువులను చూసి నేర్చుకోవాలంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అడవుల్లో ఏవైన జంతువులు చనిపోతే వాటిని దహనం చేసేందుకు ఆ జాతికి చెందిన జంతువులు గుంపుగా వెళతాయా.... అంటూ అవుననే సమాధానం వస్తుంది.. సాధరణంగా ఎవైన జంతువులు అడవిలో చనిపోతే వాటిని అక్కడి వదిలేసి వెళతాయి.. అనంతరం చనిపోయిన జంతువులను ఇతర జంతువులు పీక్కు తింటాయి..కాని ఓ అటవి అధికారి పెట్టిన వీడియోను చూస్తే మాత్రం మనుష్యుల్లాగే ఏనుగులు కూడ తమ చనిపోయిన పిల్ల ఎనుగులకు దహన సంస్కరాలు చేస్తాయని అర్ధమవుతుంది.
ఇందులో భాగంగానే అటవీ అధికారి అయిన ప్రవీణ్ కశ్వాల్ సోషల్ మీడియాలో వీడీయోను పోస్ట్ చేశాడు..అందులో చనిపోయిన పిల్ల ఏనుగును నోటితో పట్టుకుని ఈడ్చుకుంటూ ఓ ఏనుగు వచ్చింది. ఇక ఆ ఏనుగు వెంట ఇతర ఏనుగులు బాట పట్టాయి.అయితే ఆ పిల్ల ఎనుగు యొక్క శవయాత్రగా అటవీ అధికారి తెలిపారు.కాగా ఈ వీడీయోను ఇప్పటికే పదివేల మందికి పైగా చూశారు. మరో 15 పదిహేను వేల మంది నెటిజన్లు లైక్ కొట్టారు. దీంతో నెట్టిట్లో వీడియో హల్చల్ చేస్తుంది.