పుల్వామాలో మరోసారి కాల్పులు
గత రెండు మూడు రోజులుగా కశ్మీర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి.భద్రతా దళాలకు మరియు తీవ్రవాదులకు మధ్య బీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పుల్వామా జిల్లాలోని రాజ్పుర ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఇద్దరు తీవ్రవాదులు భద్రత దళాలకు చిక్కినట్టుగా సమాచారం.
ఇక పీఓకేలో విదేశీ జర్నలిస్టు ప్రతినిధులు పర్యటిస్తున్న నేపథ్యంలోనే కాల్పుల విరమణ పాటించి తమకు సహకరించాలని పాకిస్తాన్ సైన్యం భారత్కు ఆర్మీని కోరింది. అయితే పాకిస్తాన్ మాట మీద నిలబడకుండా పూంచ్ జిల్లాల్లో కాల్పులకు తెగబడింది. దీంతో ఇద్దరు పౌరులు గాయపడినట్టు అధికారులు తెలిపారు.
పాకిస్తాన్ నుండి అక్రమంగా భారత్లోకి చొరబడుతున్న తీవ్రవాదులను అడ్డుకునేందుకు భారత ఆర్మీ బృందం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.. దీంతో ఆదివారం నాడు నాడు జరిపిన కాల్పుల్లో పీవోకేలోని నాలుగు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం అయ్యాయి. దీంతో ఇరవై మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందగా మరో పదిమంది పాకిస్తాన్ సైనికులు సైతం హతం అయిన విషయం తెలిసిందే... అయితే పాకిస్తాన్ మాత్రం తమకు ఎలాంటీ ప్రాణ నష్టం జరగలేదని పాకిస్తాన్ ప్రకటించింది. అయితే పీవోకేలో జరిగిన దాడులకు ప్రతికార దాడులు చేస్తున్న నేపథ్యంలోనే పుల్వామాలో ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.