మిస్సైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ విమానం 2
ఆస్సాంలో టేకాఫ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం an-32 మిలిటరీ ట్రాన్స్ పోర్టో విమానం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మిస్ అయింది..మధ్యహ్నాం ఒంటిగంట నుండి విమానానికి సంబంధించిన సమాచారం తెలియడంలేదు. కాగా అస్సాం ఎయిర్ బేస్ నుండి నుండి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం మిస్ అయినట్టు చెబుతున్నారు. కాగా విమానంలో 13 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 5గురు ప్రయాణికులు కాగా మరో ఎనిమిది మంది ఐఏఎఫ్ సిబ్బంది ఉన్నారు.
కాగా విమానాన్ని కనుగోనేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని ప్రయత్నాలను చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.కాగా అటోనోవ్ 32 అస్సాంలోని జోర్హాట్ నుండి అరుణాచల్ ప్రదేశ్లోని మెచుక వ్యాలీకి వెళుతోంది.కాగా మెచుక వ్యాలీలో ఉన్న ఎయిర్ బేస్ అంత్యంత సంక్షిష్టమైన ఎయిర్ పోర్టు, ఇక్కడ విమానాలు టేకాఫ్ ,కావడం కాని ల్యాండింగ్ కావడం కూడ అంత్యంత కష్టంతో కూడుకున్న వ్వవహరం..
ఈ సంఘటనం కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఎయిర్ క్రాఫ్ట్ మిస్సింగ్ పై ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ సింగ్ బదూరియాతో చర్చించారు.ఎయిర్ క్రాఫ్ట్ మిస్సింగ్ పై వివరాలు తెలిపాడని చెప్పారు.కాగా అందులో వారు సురక్షితంగా రావాలని ఆయన తెలిపారు.
ఇక 2016లో కూడ ఏన్ 32 చెన్నై నుండి అండమాన్ నికోబాద్ దీవులకు వెళుతున్న సంధర్భంలో టేకాఫ్ అయిన విమానం బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో తప్పిపోయింది.కాగా ఎయిర్ దాన్ని కనుకొనేందుకు శతవిధాలా ప్రయత్నించింది.చాల రోజుల పాటు సముంద్ర జలాల్లో వెతికింది. కాని ఇప్పటివరకు ఆ ఎయిర్ క్రాఫ్ట్ లభించలేదు. కాగా అందులో ఉన్న 29 మంది దుర్మరణం పాలయ్యారు.